సంక్షోభంలో వైద్య రంగం
సంక్షోభంలో వైద్య రంగం పలు సవాళ్లు ఎదుర్కొంటున్న ఆస్పత్రులు విధి నిర్వహణకు వైద్య సిబ్బంది నిరాసక్తత..! మృతశిశువును కడుపులో మోస్తూ ఆయాసపడుతున్న ఓ గర్భిణి.. కరోనా అనుమానం కారణంగా వైద్యం అందక 12 గంటలపాటు నరకయాతన అనుభవించి ప్రాణాలు కోల్పోయింది!! హన్మకొండలో జరిగిన దారుణమిది!! ‘ఊపిరి ఆడటం లేదని చెప్పినా ఆక్సిజన్ బంద్ చేసిన్రు. గుండె ఆగిపోయింది. ఊపిరొక్కటే కొట్టుకుంటోంది. డాడీ బై.. డాడీ బై, అందరికీ బై డాడీ’ ..అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న కొన్ని క్షణాలకే ప్రాణాలు కోల్పోయిన రవికుమార్ హృదయవిదారక స్థితి ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది!! జ్వరం, దగ్గుతో బాధపడుతూ.. ఊపిరి తీసుకోలేని స్థితిలో ఉన్న మహిళను చికిత్స కోసం తీసుకెళ్తే.. ‘కరోనా లక్షణాలున్నాయి, చికిత్స చేయం’ అంటూ పది ఆస్పత్రులు తిప్పి పంపేశాయి! చివరికి గాంధీ ఆస్పత్రి ముందే నురగలు కక్కుతూ చనిపోయిందామె!! పదిరోజుల క్రితం జరిగిన విషాదమిది!! (హైదరాబాద్ సిటీ- ఆంధ్రజ్యోతి) కరోనా దెబ్బకు రాష్ట్రంలో వైద్య రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కేసులు నానాటికీ శరవేగంగా పెరిగిపోతుండడంతో కార్పొరేట్, ప్రైవేట్, నర్సింగ్ హోమ్లు, క్లినిక్ల